హైకోర్టు అనుమతితో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో ఓటర్ల తుది జాబితాను ఈనెల 12న విడుదల చేసింది. అయితే నామినేషన్ల గడువు ముగిసే వరకు అంటే నవంబర్ 19 వరకు ఈ జాబితాలో తప్పులను సవరించుకోవడానికి అనుమతిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం రజత్ కుమార్ తెలిపారు. ఓటర్ల జాబితా వివరాలు:
రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య: 2,73,28, 054
పురుషులు: 1,37,87,920
మహిళలు: 1,35,28, 020
నపుంసకులు: 2,663
సర్వీస్ ఓటర్లు: 9,451
గతంలో రూపొందించిన ఓటర్ల జాబితా ముసాయిదా కంటే తుది జాబితాలో 11,91,278 మంది ఓటర్లు పెరిగినట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. నవంబర్ 19 వరకు కొత్తగా ఎంతమంది ఓటర్లుగా నమోదు అయితే వారందరినీ కూడా ఈ తుది జాబితాలో చేర్చి ఓటు హక్కు కల్పిస్తామని పేర్కొంది. ఆ సంఖ్య ఆధారంగానే డిసెంబర్ 7న ఎన్నికలు నిర్వహించబడతాయని రాష్ట్ర ఎన్నికల సంఘం రజత్ కుమార్ తెలిపారు.