ఎన్నికలు దగ్గర పడుతున్నందున రాష్ట్రంలో అన్ని పార్టీలలో నేతల వలసలు మొదలయ్యాయి. నిజామాబాద్ జిల్లాకు చెందిన తెరాస ఎమ్మెల్సీ డాక్టర్ ఆర్.భూపతిరెడ్డి ఇటీవల రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయనకు శుక్రవారం గాంధీ భవన్లో శాలువా కప్పి సన్మానం చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లాకు చెందిన ఆయన అనుచరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారిలో పలువురు ఎంపీటీసీలు, జడ్పీటీసీలున్నారు. నిజామాబాద్ నుంచి పోటీ చేయడానికి ఆర్.భూపతిరెడ్డికి టికెట్ హామీ లభించినట్లు సమాచారం. మహాకూటమి సీట్ల సర్దుబాటు చేసుకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులను ప్రకటిస్తే ఆయనకు టికెట్ ఖరారయిందో లేదో స్పష్టత వస్తుంది.