కాంగ్రెస్ ప్రచారసభలో అపశృతి

October 12, 2018


img

కాంగ్రెస్ ఎన్నికల ప్రచారసభలో చిన్న అపశృతి జరిగింది.  విజయశాంతి, భట్టి విక్రమార్క, నంది ఎల్లయ్య తదితర సీనియర్ కాంగ్రెస్ నేతలు అందరూ నాగర్‌కర్నూలు జిల్లా, అచ్చంపేటలో శుక్రవారం సాయంత్రం ఎన్నికల ప్రచారసభ నిర్వహించడానికి తరలివచ్చారు. కాంగ్రెస్ స్టార్ కేంపెయినర్ విజయశాంతి ప్రసంగించబోతుండగా హటాత్తుగా వేదిక కూలిపోయింది. దాంతో ఆమెతో సహా వేదికపైనున్న కాంగ్రెస్ నేతలు అందరూ క్రింద పడిపోయారు. అయితే వేదిక చిన్నదే కావడంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు.       



Related Post