తెలంగాణా శాసనసభ ఎన్నికల బరిలో ఆమాద్మీ పార్టీ కూడా ఉంటుందని ఆ పార్టీ సీనియర్ నేత, ఆమాద్మీ ఎమ్మెల్యే సోమ్ నాధ్ భారతి శుక్రవారం డిల్లీలో ప్రకటించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణా రాష్ట్రంలో మేము సర్వే జరిపించినపుడు అక్కడి ప్రజలు టిఆర్ఎస్ సర్కారు పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుసుకొన్నాము. ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీలాగే అక్కడ సిఎం కెసిఆర్ కూడా ప్రజలకు ఇచ్చిన ఒక్క వాగ్ధానం కూడా అమలుచేయలేదు. కనుక త్వరలో జరుగబోయే ఎన్నికలలో మా ఆమాద్మీ పార్టీ తెలంగాణాలోని 119 స్థానాలకు పోటీ చేస్తుంది, అని చెప్పారు.