కిషన్ రెడ్డి మళ్ళీ అక్కడి నుంచే...

September 18, 2018


img

బిజెపి తాజా మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి ఈసారి లోక్‌సభకు పోటీ చేస్తారని మీడియాలో ఊహాగానాలు వినిపించాయి కానీ తాను మళ్ళీ అంబర్‌పేట నుంచి శాసనసభకు పోటీ చేయబోతున్నానని కిషన్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. ఆయన ఇప్పటి వరకు వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. మొదటిసారి 1999లో కార్వాన్ నుంచి, 2004లో హిమాయత్ నగర్ నుంచి, మూడవసారి 2014లో అంబర్ పేట నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2014 ఎన్నికలలో సుమారు 60,000 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచి తన నియోజకవర్గంపై పట్టును నిరూపించిచూపారు. అయితే గత నాలుగేళ్లలో రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులు, పార్టీల బలాబలాల కారణంగా కిషన్ రెడ్డి ఈసారి కాంగ్రెస్‌, టిఆర్ఎస్‌ల నుంచి గట్టి పోటీ ఎదుర్కోవలసి ఉంటుంది. కనుక ఈసారి కూడా భారీ మెజార్టీతో గెలుస్తారో లేదో చూడాలి.


Related Post