మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి మరణానికి సంతాపం ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం సెలవు ప్రకటించింది. కనుక నేడు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, కార్పొరేషన్లు, విద్యాసంస్థలకు సెలవు. ముఖ్యమంత్రి కెసిఆర్ వాజ్పేయి మృతికి సంతాపం తెలిపారు. ఆయన రాజకీయాలు విలువలతో కూడినవని, దేశంలో రాజకీయ నేతలకే కాక యావత్ ప్రపంచానికి ఆయన ఆదర్శంగా నిలుస్తారని అన్నారు. ఈరోజు సాయంత్రం డిల్లీలో విజయ్ ఘాట్ వద్ద వాజ్పేయి అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించబడతాయి.