హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలకు భంగం కల్గిస్తున్నారనే కారణంతో నగర పోలీస్ కమీషనర్ శ్రీపీఠాధిపతి పరిపూర్ణానంద స్వామికి, సినీ విమర్శకుడు కత్తి మహేశ్ కు ఆరు నెలలపాటు హైదరాబాద్ నగర బహిష్కరణ విధించగా, వారిలో స్వామీజీ కొన్ని రోజుల క్రితం హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం ఆయనపై విధించిన బహిష్కరణను ఎత్తివేస్తూ ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. కనుక కత్తి మహేశ్ కూడా హైకోర్టులో అప్పీలు చేసుకొన్నారు. ఆ పిటిషనును ఈరోజు విచారించిన న్యాయమూర్తి దీనిపై 10 రోజులలోగా కౌంటరు దాఖలు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఈ కేసు తదుపరి విచారణను ఆగస్ట్ 27వ తేదీకి వాయిదా వేశారు.