భాజపా ఎంపి సుబ్రహ్మణ్యస్వామి తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ను హెచ్చరిస్తూ గురువారం ఒక లేఖ వ్రాశారు. పరిపూర్ణానంద స్వామికి నగరబహిష్కరణ చేసినందుకు అయన సిఎం కెసిఆర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయనపై నమోదు చేసిన సెక్షన్స్ ప్రకారం అయన ఒక గుండా ఒక అసాంఘీకశక్తి అని ఆరోపిస్తున్నట్లుంది. ఇది స్వామీజీ గౌరవానికి, ప్రతిష్టకు భంగం కలిగించేవే. అయనకు నగర బహిష్కరణ విధించడం ద్వారా అయన ప్రాధమిక హక్కులను కూడా కాలరాస్తున్నారు. కనుక ఆయనపై విధించిన నగర బహిష్కరణను తక్షణం ఉపసంహరించుకోకపోతే న్యాయస్థానంలో కేసు వేసి నష్టపరిహారం కోరుతానని సుబ్రహ్మణ్య స్వామి తన లేఖలో సిఎం కెసిఆర్ ను హెచ్చరించారు. ఇదిగో ఆయన లేఖ...