ప్రధాని సభలో అపశ్రుతి

July 16, 2018


img

ప్రధాని నరేంద్రమోడీ సభలో చిన్న ప్రమాదం జరిగింది. సోమవారం పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో మిడ్నాపూర్ లో ప్రధాని నరేంద్రమోడీ బహిరంగసభలో ప్రసంగిస్తున్నప్పుడు మహిళలు కూర్చొన్న ప్రాంతంలో టెంట్ కూలిపోయింది. దాంతో అక్కడ కూర్చొన్నవారు స్వల్పంగా గాయపడ్డారు.

టెంట్ కూలిపోవడం చూసి ప్రధాని మోడీ వెంటనే తన ప్రసంగం నిలిపివేసి, మైకులో పోలీసులకు, ఎన్ఎస్జి సిబ్బందిని అప్రమత్తం చేసి తక్షణమే వారికి సహాయపడాలని సూచించారు. అలాగే తనను చూసేందుకు టెంట్ కర్రలపైకి ఎక్కినా కుర్రాళ్ళను వెంటనే దిగిపోమని హెచ్చరించారు. గాయపడిన వారిని తక్షణమే అక్కడే ఉన్న అంబులెన్స్ వాహనాలు, కార్లలో స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ తరువాత ప్రధాని నరేంద్రమోడీ కూడా ఆసుపత్రికి వెళ్లి వారిని పరామర్శించారు. టెంట్ నిలబెట్టడానికి ఏర్పాటు చేసిన కర్రలపైకి కొందరు కుర్రాళ్ళు ఎక్కడం వలననే ఈ ప్రమాదం జరిగింది. 


Related Post