జవాబు ఇవ్వలేదని బాధపడొద్దు: కేటిఆర్

June 22, 2018


img

రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖల మంత్రి కేటిఆర్ ట్విట్టర్ ద్వారా ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటారనే సంగతి అందరికీ తెలుసు. కనుక రోజూ అనేకమంది తమ గ్రామాలలో, పట్టణాలలో ఎదుర్కొంటున్న సమస్యల గురించి, కొందరు తమ వ్యక్తిగత సమస్యల గురించి ట్విట్టర్ ద్వారా మంత్రి కేటిఆర్ కి విజ్ఞప్తులు చేస్తుంటారు. ప్రభుత్వ వ్యవహారాలతో క్షణం తీరికలేని జీవితం గడుపుతున్నప్పటికీ కేటిఆర్ వాటిని విస్మరించరు. అయితే సమయాభావం వలన అందరికీ వ్యక్తిగతంగా జవాబు ఇవ్వలేనని కానీ అంతమాత్రన్న వారి విజ్ఞప్తులను పట్టించుకోలేదని అనుకోవద్దని కేటిఆర్ ట్వీట్ చేశారు. కనుక ప్రజలు తమ తమ ప్రాంతాలలో రోడ్లు, మురికి కాలువలు, త్రాగునీరు వంటి సమస్యలున్నట్లయితే వాటిని ట్విట్టర్ ద్వారా తనకు తెలియజేయవచ్చునని కేటిఆర్ ట్వీట్ చేశారు. వాటిని సంబంధితశాఖల ఉన్నతాధికారులకు పంపించి పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంటానని కేటిఆర్ చెప్పారు.



Related Post