బోనాల పండుగ అంటే తెలంగాణాలో ఇంటింటా సంబరం..ఒకటా రెండా..ఏకధాటిగా 20 రోజులుసాగే రంగురంగుల ముచ్చట. అయినా తనివి తీరని ముచ్చట అది. ఈ ఏడాది బోనాల పండుగ జూలై 15వ తేదీ నుంచి ప్రారంభమయ్యి ఆగస్ట్ 5తో ముగుస్తుంది. ఇక భాగ్యనగరంలో బోనాల పండుగ హడావుడి అంతా ఇంతాకాదు. ఈసారి కోటి రూపాయల వ్యయంతో 3.80 కిలోల బంగారంతో అమ్మవారికి బంగారు బోనం చేయిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాలలో ఉన్న 145 ఆలయాలలో ఈసారి కూడా తెలంగాణా సంస్కృతీ సంప్రదాయాలకు అద్దంపట్టే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ కళాకారుల చేత కళాప్రదర్శనలు నిర్వహించబోతున్నట్లు మంత్రి తలసాని చెప్పారు. బోనాల ఉత్సవాల కోసం ఘనం ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. జూలై 29న మహంకాళీ అమ్మవారి బోనాలు, 30వ తేదీన రంగం ఉంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.