మహిళను కాలితో తన్నాడు...అరెస్ట్ అయ్యాడు

June 18, 2018


img

నిజామబాద్ జిల్లాలోని దర్పల్లి ఎంపిపి ఇమ్మడి గోపిని పోలీసులు అరెస్ట్ చేశారు. తనను చెప్పుతో కొట్టిన దళితమహిళ గుండెలపై కాలితో తన్నినందుకు పోలీసులు అరెస్ట్ చేశారు. 

జిల్లలో ఇందల్ వాయి జాతీయ రహదారి పక్కనే గోపికి 1,125 గజాల స్థలం, దానిలో ఒక ఇల్లు ఉన్నాయి. ఇందల్ వాయి మండలంలోని గౌరారంకు చెందిన ఒడ్డె రాజవ్వ వాటిని 11 నెలల క్రితం రూ.33.72 లక్షలు చెల్లించి గోపీ నుంచి కొనుకొంది. ఆమె పేరుపై అవి రిజిస్ట్రేషన్ కూడా అయ్యాయి. కానీ నేటి వరకు ఆమెకు ఆ ఇంటిని అప్పగించలేదు. మరో రూ.65 లక్షలు ఇస్తేనే ఇంటిని, స్థలాన్ని స్వాధీనం చేస్తానని గోపీ చెపుతుండటంతో, ఒడ్డె రాజవ్వ తన బంధువులను వెంటపెట్టుకొని వచ్చి ఆ ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లో వస్తువులను బయటకు విసిరేసి ఇంటిని స్వాధీనం చేసుకొంది. ఈ విషయం తెలిసిన గోపి అక్కడకు చేరుకొని వారితో వాగ్వాదానికి దిగాడు. దాంతో సహనం కోల్పోయిన ఒడ్డె రాజవ్వ అతనిని చెప్పుతో కొట్టింది. అప్పుడు అతను కూడా తీవ్ర ఆగ్రహంతో మహిళ అని చూడకుండా ఆమె గుండెలపై కాలితో తన్నాడు. ఆ దెబ్బకు ఆమె క్రిందపడిపోయింది. అతను ఆమెను కాలితో తన్నుతున్నప్పుడు ఎవరో తీసిన వీడియో మీడియాకు చేరడంతో అది వైరల్ అయ్యింది. దేశవ్యాప్తంగా ప్రధాన మీడియాలో ప్రసారం అవుతుండటంతో, ఆమె పిర్యాదు మేరకు పోలీసులు గోపిని అరెస్ట్ చేశారు. 


Related Post