మొదటిదశ తెలంగాణా ఉద్యమాలలో పోరాడిన ఉద్యమకారుడు ఆదిరాజు వెంకటేశ్వరరావు హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో శుక్రవారం ఉదయం కన్నుమూశారు. 1969లో జరిగిన తెలంగాణా ఉద్యమాలలో అయన చురుకుగా పాల్గొన్నారు. అయన చాలాకాలం పాటు పత్రికారంగంలో పనిచేసి మంచి జర్నలిస్టుగా పేరు పొందారు. అయన స్వస్థలం ఖమ్మం జిల్లాలో పండితాపురం గ్రామం. అయన కుటుంబ సభ్యులకు సిఎం కెసిఆర్ ప్రగాడ సానుభూతి తెలిపారు.