కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిత్యం ఏదో ఒక సాకుతో ప్రధాని నరేంద్రమోడీపై విమర్శలు గుప్పిస్తుండటం అందరూ చూస్తున్నదే. కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ రాహుల్ గాంధీకి చురకలు వేశారు.
“తెలివితేటలు వంశపారంపర్యంగా వచ్చేవి కావు. వాటిని కష్టపడి సంపాదించుకోవలసి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఒక దశదిశలేకుండా పనిచేస్తోంది. నరేంద్రమోడీ నామస్మరణ చేయడమే దానికి అలవాటుగా మారిపోయిందిపుడు,” అని ఫేస్ బుక్ ద్వారా రాహుల్ గాంధీకి చురకలు వేశారు.