గజ్వేల్ లో ఘోర రోడ్డు ప్రమాదం

May 26, 2018


img

గజ్వేల్ మండలం రిమ్మనగూడ సమీపంలో రాజీవ్ రహదారిపై శనివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకవైపు నుంచి రెండు లారీలు, మరో వైపు నుంచి రాజధాని బస్సు ఎదురెదురుగా వచ్చాయి. వాటి మద్యలో క్వాలీస్ వాహనం నలిగిపోయింది. ఒకేసారి నాలుగు వాహనాలు ఒకదానినొకటి గట్టిగా డ్డీ కొనడంతో క్వాలిస్ వాహనంలో ప్రయాణిస్తున్న 8 మంది ప్రయాణికులు చనిపోయారు.

లారీని డ్డీ కొన్న తరువాత బస్సు బోల్తా పడటంతో బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. మరో 30 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కనుక మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రమాదం సంగతి తెలియగానే పోలీసులు తక్షణమే అక్కడికి చేరుకొని సహాయచర్యలు చేపట్టారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలను ఆదుకొంటామని సిఎం కెసిఆర్ అన్నారు.           



Related Post