కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణా రాష్ట్రంలో 11 జిల్లాలకు, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, నగర అధ్యక్షులను నియమించింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కార్యాలయం ఈమేరకు శుక్రవారం ఒక ప్రకటన జారీ చేసింది. కొత్తగా జిల్లా అధ్యక్షులుగా నియమింపబడినవారి వివరాలు:
హైదరాబాద్ నగర డీసీసీ అధ్యక్షుడు: అంజన్ కుమార్ యాదవ్
రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు: క్యామ మల్లేశ
మెదక్ డీసీసీ అధ్యక్షురాలు: వి. సునీతా లక్ష్మారెడ్డి
నల్గొండ డీసీసీ అధ్యక్షుడు: బూడిద భిక్షమయ్య గౌడ్
వరంగల్ డీసీసీ అధ్యక్షుడు: నాయిని రాజేందర్ రెడ్డి
వరంగల్ నగర డీసీసీ అధ్యక్షుడు: కడారి శ్రీనివాసరావు
కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు: కటకం మృత్యుంజయం
కరీంనగర్ నగర డీసీసీ అధ్యక్షుడు: కర్ర రాజశేఖర్
రామగుండం నగర డీసీసీ అధ్యక్షుడు: లింగస్వామి యాదవ్
నిజామాబాద్ డీసీసీ అధ్యక్షుడు: తాహెర్ బిన్ హమ్దాన్
నిజామాబాద్ నగర డీసీసీ అధ్యక్షుడు: కేశ వేణు
ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడు: అల్లేటి మహేశ్వర్ రెడ్డి
మహబూబ్ నగర్ డీసీసీ అధ్యక్షుడు: ఓబేదుల్లా కొత్వాల్