కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ గురువారం రాష్ట్ర డిజిపి ఎం.మహేందర్ రెడ్డిని కలిసి తమకు ప్రాణహాని ఉంది కనుక గన్-మ్యాన్లను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. హైకోర్టు తమ సభ్యత్వాల రద్దు చెల్లదని తీర్పు చెప్పింది కనుక తమకు ప్రోటోకాల్ ప్రకారం కల్పించవలసిన సౌకర్యాలన్నీ కల్పించాలని వారు డిజిపికి విజ్ఞప్తి చేశారు. ఒకవేళ తమకు భద్రత కల్పించనట్లయితే త్వరలోనే డిల్లీ వెళ్లి అక్కడ జంతర్ మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్షకు కూర్చొంటామని ఇద్దరు ఎమ్మెల్యేలు డిజిపిని హెచ్చరించారు. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకొంటానని డిజిపి ఎం.మహేందర్ రెడ్డి వారికి హామీ ఇచ్చినట్లు సమాచారం.