నేడు హైదరాబాద్ మహానాడుకు చంద్రబాబు

May 24, 2018


img

నేడు తెలంగాణా తెదేపా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ‘మహానాడు’ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి ఏపి సిఎం చంద్రబాబు నాయుడు హాజరవుతున్నారు. ఈరోజు గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 1.40 గంటలకు బేగంపేట విమానాశ్రయం చేరుకొంటారు. అక్కడి నుంచి రోడ్డుమార్గాన్న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ చేరుకొని మహానాడు సమావేశంలో పాల్గొంటారు. సమావేశం ముగిసిన తరువాత సాయంత్రం 4.30 గంటలకు హైదరాబాద్ లోని తన నివాసానికి చేరుకొంటారు. ఈరోజు రాత్రికి అక్కడే ఉండి రేపు ఉదయం మళ్ళీ బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకొంటారు. 



Related Post