ఏపి ఎక్స్ ప్రెస్ లో మంటలు

May 21, 2018


img

ఈరోజు డిల్లీ నుంచి విశాఖకు వస్తున్న ఏపి ఎక్స్ ప్రెస్ గ్వాలియర్ స్టేషన్ నుంచి బయలుదేరిన కొన్ని నిమిషాలకే దానిలోని బి6, బి7 ఏసీ బోగీలలో హటాత్తుగా మంటలు చెలరేగాయి. అది చూసి ప్రయాణికులు వెంటనే చైన్ లాగి రైలును నిలిపివేసి తమ సామానుతో సహా క్రిందకు దూకేసి ప్రాణాలతో తప్పించుకోగలిగారు. ఈ ప్రమాదం సంగతి తెలుసుకొన్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకొని మంటలను ఆర్పేరు. ఆలోగా రెండు బోగీలు దగ్ధమయ్యాయి. ఆ రైలులో ప్రయాణిస్తున్న 36 మంది ఐపిఎస్ ట్రైనీలతో సహా ప్రయాణికులు అందరూ క్షేమంగా ఉన్నారని రైల్వే అధికారులు ప్రకటించారు. వారినందరినీ వేరే రైళ్ళలో వారి గమ్యస్థానాలకు చేర్చుతామని రైల్వే అధికారులు చెప్పారు. ఏసీ బోగీలలో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చునని అధికారులు అనుమానిస్తున్నారు. 



Related Post