కర్ణాటక తీర్పు ఫెడరల్ ఫ్రంట్ కు అనుకూలం: కవిత

May 19, 2018


img

తెరాస ఎంపి కవిత శుక్రవారం నిజామాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ కర్ణాటక ఎన్నికల ఫలితాలు, జాతీయపార్టీలపై వ్యాఖ్యలు చేశారు. “కర్ణాటక ఎన్నికల ఫలితాలను చూస్తే దేశంలో జాతీయపార్టీలకు గడ్డుకాలం నడుస్తున్నట్లు అర్ధమవుతుంది. ప్రాంతీయ పార్టీల సహకారం లేకుండా అవి తమంతట తాముగా ఎక్కడా ప్రభుత్వం ఏర్పాటుచేయగల పరిస్థితిలో లేవని స్పష్టం అవుతోంది. సిఎం కెసిఆర్ చెప్పినట్లుగానే కర్ణాటక ప్రజలు ఫెడరల్ ఫ్రంట్ కు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. రానున్న రోజులలో దేశవ్యాప్తంగా ఫెడరల్ ఫ్రంట్ కు ఆదరణ పెరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పధకంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది,” అని అన్నారు. ఈ సందర్భంగా ఆమె తమ ప్రభుత్వం చేపట్టిన పలు సాగునీటి ప్రాజెక్టులు, సంక్షేమ పధకాల గురించి విలేఖరులకు వివరించారు.



Related Post