ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రజ్యోతి-ఏబిఎన్ అధినేత వేమూరి రాధాకృష్ణ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు తన న్యాయవాది ద్వారా లీగల్ నోటీస్ పంపించారు. పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో తనపై, తన సంస్థపై చేస్తున్న ఊహాజనితమైన తీవ్ర ఆరోపణల వలన తన వ్యక్తిగత ప్రతిష్ట, సంస్థ ప్రతిష్ట దెబ్బ తింటోంది కనుక వాటిని తక్షణమే ఉపసంహరించుకొని బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని లేకుంటే పరువు నష్టం దావాను ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండాలని హెచ్చరించారు.
ఆంధ్రజ్యోతి-ఏబిఎన్ న్యూస్ మీడియా విలువలకు కట్టుబడి నడుస్తున్న సంస్థ అని, సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఒక తీవ్రమైన సమస్యను ప్రజల దృష్టికి తీసుకువచ్చేందుకు ప్రయత్నించిందే తప్ప ఎవరినీ కించపరచాలని ఎన్నడూ ప్రయత్నించలేదని, కానీ పవన్ కళ్యాణ్ పడిపోతున్న తన రాజకీయ ప్రతిష్టను పునరుద్దరించుకోవడానికే ఊహాజనితమైన ఆరోపణలు చేస్తున్నారని, దాని వలన తన, తన సంస్థ ప్రతిష్ట దెబ్బతింటోందని కనుక పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ పేజీలో తనను, ఆంధ్రజ్యోతి-ఏబిఎన్ ఉద్దేశ్యించి పెట్టిన అన్ని ట్వీట్లను తక్షణమే ఉపసంహరించుకొని బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని లేకుంటే పరువు నష్టం దావాను ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండాలని నోటీస్ ద్వారా హెచ్చరించారు.