ప్రధానిపై బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు

April 20, 2018


img

ఇవ్వాళ్ళ విజయవాడలో ఏపి సిఎం చేస్తున్న ‘ధర్మదీక్ష’ సభలో ప్రముఖ నటుడు, తెదేపా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశ్యించి చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు. విభజన హామీలు అమలుచేయకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసిన నరేంద్ర మోడీని తెలుగు ప్రజలు తరిమితరిమి కొట్టాలని అన్నారు. మోడీ ఒక ద్రోహి, శిఖండి...చిల్లర రాజకీయాలు చేస్తూ రాజకీయాలలో తనకంటే సీనియర్ అయిన చంద్రబాబు నాయుడు ముందు కుప్పిగంతులు వేస్తున్నారని విమర్శించారు. నీ కంటే పెద్దవారిని, నీ భార్యను గౌరవించడం నేర్చుకోమని మోడీ వ్యక్తిగత విషయంపై కూడా నోరుజారారు. రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వకుండా గుప్పెడు మట్టి, చెంబుడు నీళ్ళు డిల్లీ నుంచి పట్టుకువచ్చి తెలుగువారినందరినీ మోడీ అవమానపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా రాష్ట్రంలో మట్టి నీళ్ళు లేవనే మీరు వాటిని డిల్లీ నుంచి మోసుకువచ్చారా?అని ప్రశ్నించారు. తన ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశ్యించి అన్న మాటలు ఆయనకు కూడా అర్ధం కావాలనే ఉద్దేశ్యంతో బాలకృష్ణ కాసేపు హిందీలో ప్రసంగించారు.        



Related Post