తెలంగాణాలో పేదింటి ఆడపిల్లల పెళ్ళిళ్ళకు రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పేరుతో ఒక్కొక్కరికీ రూ51,000 ఆర్ధిక సహాయం అందించేది. తరువాత దానిని రూ. 75,116కు పెంచింది. తాజాగా దానిని రూ.1,00,116లకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మొత్తాన్ని చెక్కు రూపంలో పెళ్ళి రోజున లేదా కొన్ని రోజుల ముందుగానే అందజేయాలన్న మంత్రి జోగురామన్న ప్రతిపాదనకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఆమోదం తెలిపారు. తద్వారా ఆ డబ్బు అవసరమైన సమయంలో ఉపయోగపడుతుంది. ముఖ్యమంత్రి కెసిఆర్ మానవతా దృక్పధంతో తీసుకొంటున్న ఇటువంటి నిర్ణయాలే ప్రజలలో అయనకు నానాటికీ ఆదరణపెరిగేలా చేస్తున్నాయి. ఆ ప్రజాధారణే తెరాసకు శ్రీరామరక్షగా నిలుస్తోంది.