గవర్నర్ నరసింహన్ సోమవారం ఉభయసభల సభ్యులను ఉద్దేశ్యించి ప్రసంగిస్తున్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభలో అనుచితంగా ప్రవర్తించినందుకు 11 మంది శాసనసభ్యులతో పాటు ఐదుగురు శాసనమండలి సభ్యులపై సస్పెన్షన్ వేటుపడింది. కాంగ్రెస్ మండలి సభ్యులు షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డి, సంతోష్, దామోదర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆకుల లలితలను ఈ బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్ చేస్తున్నట్లు డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ ప్రకటించారు.