ఓటుకు నోటు కేసులో కొత్త ట్విస్ట్

February 23, 2018


img

మళ్ళీ చాలా కాలం తరువాత ఓటుకు నోటు కేసు ప్రస్తావన పైకి వచ్చింది. ఆ కేసులో 4వ నిందితుడుగా ఉన్న జెరూసలెం ముత్తయ్య సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఒక లేఖ వ్రాశారు. ఈ కేసుతో తనకు ఎటువంటి సంబందమూ లేదని, అయినప్పటికీ తనను అన్యాయంగా దీనిలో ఇరికించారని పిర్యాదు చేశారు. ఈ కేసులో తనను అప్రూవర్ మారేందుకు న్యాయస్థానం అంగీకరించినట్లయితే ఈ కేసుకు సంబందించిన పూర్తి వివరాలు చెప్పడానికి తాను సిద్దమని తెలిపారు. ఈ కేసులో ఏపి, తెలంగాణా ప్రభుత్వాలు చేసిన తప్పులను కప్పి పుచ్చుకోవడానికి తనను హత్య చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నాయని మత్తయ్య పిర్యాదు చేశారు. తనకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి తరచూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని తెలిపారు.        



Related Post