ప్రదీప్ కు నాంపల్లి కోర్టు షాక్!

January 19, 2018


img

మద్యం త్రాగి వాహనం నడిపిస్తూ ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ లో పోలీసులకు పట్టుబడిన టీవి యాంకర్ ప్రదీప్ కు నాంపల్లి కోర్టు పెద్ద షాక్ ఇచ్చింది. ఆయన డ్రైవింగ్ లైసెన్స్ ను మూడేళ్ళపాటు రద్దు చేసి, రూ.2,100 జరిమానా విధిస్తున్నట్లు తీర్పు చెప్పింది. డ్రంక్ అండ్ డ్రైవ్’ లో ప్రదీప్ పోలీసులకు పట్టుబడినప్పుడు బ్రీత్ అనలైజర్ తో పరీక్షించగా 170 పాయింట్లు ఉన్నట్లు తేలింది. సాధారణంగా 35 లోపు పాయింట్లు ఉన్నట్లయితే పోలీసులు హెచ్చరికలతో సరిపెడతారు. కానీ 170 పాయింట్లు ఉన్నట్లు తేలడంతో అయన వాహనాన్ని స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేశారు. ట్రాఫిక్ పోలీసులు కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. సాధారణంగా ఈ స్థాయిలో మద్యం సేవించి పట్టుబడిన వారికి చట్టప్రకారం జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంది. కానీ దీనిని మొదటి తప్పుగా భావించి, లైసెన్స్ రద్దు చేయడంతో కోర్టు సరిపెట్టింది. కనుక అందుకు సంతోషించాల్సిందే. కోర్టు తీర్పు వెలువడింది కనుక ప్రదీప్ దానిపై హైకోర్టులో అప్పీలు చేసుకొంటారో లేక తీర్పుకు కట్టుబడి మూడేళ్ళు స్వయంగా వాహనం నడుపకుండా డ్రైవరును పెట్టుకొని కాలక్షేపం చేసేస్తారో చూడాలి. 



Related Post