కరోనా చికిత్సకు వినియోగించే ‘ఫావిపిరవిర్’ ట్యాబ్లెట్ ధరను మరోసారి తగ్గించింది సన్ ఫార్మా కంపెనీ. దేశంలో కరోనా రోగుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుండటంతో సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకురావలనే ఉద్దేశ్యంతో ‘ఫావిపిరవిర్-200 ఎంజీ’ మాత్ర ధరనురూ.50 నుంచి రూ.35కి తగ్గిస్తున్నట్లు సన్ ఫార్మా కంపెనీ ప్రకటించింది. కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిన తరువాత స్వల్ప లక్షణాలున్నవారికి ఈ మాత్రం దివ్యౌషదంలాగా పనిచేస్తుందని ఆ సంస్థ ప్రతినిధి తెలిపారు. అయితే దీనిని వైద్యుల సలహాతో మాత్రమే వేసుకోవలసి ఉంటుందని చెప్పారు.