లాక్డౌన్ కారణంగా హైదరాబాద్లో చిక్కుకుపోయిన ఏపీ సచివాలయ ఉద్యోగులను గత నెల 27న ప్రత్యేక బస్సులలో అమరావతికి తరలించారు. వారిలో వ్యవసాయశాఖలో పనిచేస్తున్న ఓ అధికారికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దాంతో ఏపీ సచివాలయంలో ఆయన పనిచేసిన రెండు బ్లాకులను ఓ మూసివేసి, వాటితో సహా పక్కనే ఉన్న మరో ఐదు బ్లాకులను కూడా శానిటైజ్ చేస్తున్నారు. ఆయనను ఆసుపత్రికి తరలించి, ఆయనతో బస్సులో కలిసి వచ్చిన మిగిలిన ఉద్యోగులకు, ఆయనతో కార్యాలయంలో కలిసి పనిచేసిన ఉద్యోగులందరికీ పరీక్షలు నిర్వహించి హొం క్వారెంటైన్లో ఉంచారు.