సచివాలయంలో కరోనా...రెండు బ్లాకులు మూసివేత

June 06, 2020
img

లాక్‌డౌన్‌ కారణంగా హైదరాబాద్‌లో చిక్కుకుపోయిన ఏపీ సచివాలయ ఉద్యోగులను గత నెల 27న ప్రత్యేక బస్సులలో అమరావతికి తరలించారు. వారిలో వ్యవసాయశాఖలో పనిచేస్తున్న ఓ అధికారికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దాంతో ఏపీ సచివాలయంలో ఆయన పనిచేసిన రెండు  బ్లాకులను ఓ మూసివేసి, వాటితో సహా పక్కనే ఉన్న మరో ఐదు బ్లాకులను కూడా శానిటైజ్ చేస్తున్నారు. ఆయనను ఆసుపత్రికి తరలించి, ఆయనతో బస్సులో కలిసి వచ్చిన మిగిలిన ఉద్యోగులకు, ఆయనతో కార్యాలయంలో కలిసి పనిచేసిన ఉద్యోగులందరికీ పరీక్షలు నిర్వహించి హొం క్వారెంటైన్‌లో ఉంచారు. 


Related Post