తెలంగాణలో మళ్ళీ పెరుగుతున్న కరోనా కేసులు

May 28, 2020
img

తెలంగాణలో మళ్ళీ కరోనా కేసులు పెరుగుతునాయి. సౌదీ అరేబియా నుంచి వచ్చినవారిలో 49 మందికి, వలస కార్మికులలో 19 మందికి కరోనా సోకింది. జీహెచ్‌ఎంసీ తదితర ప్రాంతాలలో గడిచిన 24 గంటలలో 39 కొత్త కేసులు  నమోదయ్యాయి. రాష్ట్రంలో నివశిస్తున్నవారిలో కరోనాకు గురైనవారి సంఖ్య 1,842కి చేరింది. ఇప్పటి వరకు విదేశాల నుంచి వచ్చినవారిలో 124 మందికి, వలస కార్మికులలో 173 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. అవి కూడా కలుపుకొన్నట్లయితే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2,139కి చేరింది. అయితే అన్ని రాష్ట్రాలు కూడా విదేశాల నుంచి వచ్చినవారు, వలస కార్మికుల కేసులు వేరేగా చూపుతున్నాయి. దీంతో కరోనా లెక్కలలో కొంత గందరగోళం నెలకొంది.   

రాష్ట్రంలో నిన్నటి వరకు మొత్తం 1,321 మంది కోలుకొని ఇళ్ళకు తిరిగి వెళ్ళగా మరో 714 మంది ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 63 మంది కరోనాతో మృతి చెందారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బుదవారం రాత్రి విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. 

వరంగల్ రూరల్, యాదాద్రి, వనపర్తి జిల్లాలో గత రెండు నెలలుగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు.    

 గత 14 రోజులలో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కానీ జిల్లాలు: కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, మెదక్, జయశంకర్ భూపాలపల్లి, నాగర్ కర్నూల్‌, ములుగు, పెద్దపల్లి, సిద్ధిపేట, మహబూబాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఆసిఫాబాద్‌, ఖమ్మం, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, వరంగల్‌ అర్బన్, గద్వాల్, జనగావ్, నిర్మల్ జిల్లాలు.

Related Post