ఏపీ తెలంగాణలకు రామోజీరావు విరాళం

April 01, 2020
img

రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయనిధికి చెరో 10 కోట్లు విరాళం ఆన్‌లైన్‌ ద్వారా బదిలీ చేశారు. కరోనాపై రెండు తెలుగు రాష్ట్రాలు చేస్తున్న పోరాటంలో ఉడతాభక్తిగా ఈ విరాళాలు అందజేస్తున్నామని రామోజీరావు తెలిపారు.   

ఏపీలో నిన్న ఒక్కరోజే కొత్తగా 14 కరోనా కేసులు నమోదు అయ్యాయి. అన్ని పశ్చిమగోదావరి జిల్లాలోనే నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లా కలక్టర్ ఆర్‌.ముత్యాలరాజు స్వయంగా దీనిని దృవీకరించారు. జిల్లాలో మొత్తం 30మందికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహిచగా వారిలో 14 మందికి పాజిటివ్, 10 మందికి నెగెటివ్ వచ్చాయని మరో 6 మందికి సంబందించి రిపోర్టులు అందవలసి ఉందని తెలిపారు. తాజాగా నమోదైన కరోనా కేసులతో కలిపి ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 58కి చేరింది.   


Related Post