ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయంలోగా 17 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దాంతో ఏపీలో కరోనా కేసుల సంఖ్య 40కి చేరింది. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 1,177కు పెరిగింది. ఇప్పటివరకు దేశంలో మొత్తం 46 మంది కరోనాతో చనిపోయారు. దేశవ్యాప్తంగా వివిద రాష్ట్రాలలో మంగళవారం ఉదయానికి నమోదు అయిన కరోనా కేసులు ఈవిధంగా ఉన్నాయి.
మహారాష్ట్రలో 234, కేరళలో 234, కర్ణాటకలో 91, యూపీలో 101, డిల్లీలో 97, రాజస్థాన్లో 83, గుజరాత్లో 70, తెలంగాణలో 77, తమిళనాడులో 67, మధ్యప్రదేశ్లో 47, పంజాబ్లో 41, ఏపీలో 40, పశ్చిమ బెంగాల్లో 22, హర్యానాలో 36, బీహార్లో 15, చండీఘర్లో 13, లాడాఖ్ 13, అండమాన్ నికోబార్లో 10, ఛత్తీస్గఢ్లో 8, ఉత్తరాఖండ్లో 7, గోవాలో 5, హిమాచల్ ప్రదేశ్లో 3, ఒడిశాలో 3, మణిపూర్, మిజోరాం, పుదుచ్చేరిలలో ఒక్కో కరోనా కేసులు నమోదు అయ్యాయి.