విశాఖలో ఒక కరోనా కేసు నమోదు

March 27, 2020
img

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 12కు చేరింది. విశాఖపట్నంలో కరోనా సోకిన ఒక రోగి ద్వారా అతని బందువుకు కూడా కరోనా సోకినట్లు వైద్య పరీక్షలలో నిర్ధారణ అయ్యింది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 384 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో 317 మందికి కరోనా లేదని నిర్ధారణ అయ్యింది. మిగిలినవారి రిపోర్టులు ఇంకా అందవలసి ఉంది. వారిలో స్విమ్స్ ఆసుపత్రికి చెందిన ఇద్దరు వైద్యులు కూడా ఉన్నారు. కనుక మిగిలిన వారితో పాటు వారిరువురు కూడా క్వారంటైన్‌లో ఉన్నారిప్పుడు.      


Related Post