సిఎం కేసీఆర్ జలుబు, జ్వరం సోకడంతో వైద్యుల సలహా మేరకు ఈరోజు ఉదయం వైద్యపరీక్షలు చేయించుకోవడానికి యశోదా ఆసుపత్రికి వెళ్లారు. సీనియర్ వైద్యులు ఎంవీ రావు ఆయనకు రక్త పరీక్షలు, ఈసీజీ, సీటీ స్కాన్, 2డి ఈకో పరీక్షలు చేశారు. అనంతరం సిఎం కేసీఆర్ ప్రగతి భవన్ తిరిగి వెళ్ళిపోయారు.