హమ్మయ్య మాధవి కొలుకోంటోందిట!

September 20, 2018
img

బుధవారం ఎర్రగడ్డ వద్ద తండ్రి చేతిలో కత్తివేట్లకు గురై ప్రాణాపాయ స్థితిలో యశోదా ఆసుపత్రిలో చేర్చబడిన మాధవి అనూహ్యంగా కొలుకోంటోందని ఆసుపత్రి వైద్యులు ఈరోజు సాయంత్రం ప్రకటించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రాణాపాయస్థితి నుంచి బయటపడిందని కనుక వెంటిలెటర్ తొలగించమని వైద్యులు తెలిపారు. ఆమె చాలా నీరసంగా ఉన్నప్పటికీ కొద్దికొద్దిగా మాట్లాడగలుగుతోందని వైద్యులు చెప్పారు. ఆమె శరీరం తమ వైద్యానికి స్పందిస్తోందని కనుకనే ఆమె ఇంత త్వరగా కోలుకోగలిగిందని వైద్యులు తెలిపారు. మరొక 48 గంటల పాటు ఐసియులో ఉంచి ఆమె మరింత కోలుకొన్నాక సాధారణ వార్డులోకి మారుస్తామని వైద్యులు తెలిపారు. 

ఈరోజు మధ్యాహ్నం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో ఆమె పరిస్థితి విషమంగా ఉందని, మరొక 48 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమన్నారు. కానీ ఐదారు గంటల వ్యవధిలోనే ఆమె ఇంతగా కోలుకోవడం మహాద్భుతమేనని చెప్పక తప్పదు. ఆమెను ఆసుపత్రికి తీసుకువచ్చే సమయానికి మెదడుకు రక్తం అందించే నరాలు తెగిపోయాయి. ఎడమ చెయ్యి ఎముక రెండు ముక్కలైపోవడంతో చెయ్యి చర్మానికి వ్రేలాడుతోంది. పైగా తీవ్ర రక్తస్రావం జరగడంత మృత్యువు గుమ్మం వరకు వెళ్లింది. కానీ వైద్యుల కృషి, ప్రతిభ, వారి వైద్యానికి ఆమె శరీరం సహకరించడంతో ఆమె కోలుకొంటోంది. ఆమె భర్త సందీప్ కూడా కోలుకొన్నాడు. వారం రోజుల క్రితమే పెళ్లి చేసుకొన్న ఆ దంపతులకు ఇది పునర్జన్మేనని చెప్పవచ్చు.

Related Post