నిజామాబాద్ లో గిరిరాజ్ డిగ్రీ కళాశాల మైదానంలో మంగళవారం నుంచి మూడు రోజులపాటు పతంజలి యోగపీఠం అధ్వర్యంలో యోగాభ్యాస కార్యక్రమాలు మొదలయ్యాయి. యోగాగురు బాబా రాందేవ్ స్వయంగా శిక్షణ ఇస్తున్నారు. అయన ఆహ్వానం మేరకు తెరాస ఎంపి కవిత, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి, తెరాస నేతలు రాంకిషన్ రావు, రెడ్ కో చైర్మన్ అలీం తదితరులు ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొని కొంతసేపు యోగాభ్యాసం చేశారు.