దసరా, బతుకమ్మ పండుగల సందర్భంగా నేటి నుంచి రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలకు పండుగ శలవులు మొదలయ్యాయి. మళ్ళీ అక్టోబర్ 4వ తేదీ వరకు నుంచి పాఠశాలలు, కళాశాలలు తెరచుకొంటాయి. జూనియర్ కాలేజీలకు మాత్రం ఒకరోజు ముందుగా అంటే అక్టోబర్ 3 నుంచి తరగతులు మొదలవుతాయి. కనుక రాష్ట్రంలో అన్ని ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీలు తప్పనిసరిగా దసరా శలవులను అమలుచేయాలని లేకుంటే వాటిపై కటిన చర్యలు తీసుకొంటామని రాష్ట్ర విద్యాశాఖ హెచ్చరించింది.