తెలంగాణాలో దళితుల కోసం కొత్తగా 21 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ఆమోదం తెలిపారు. వాటిలో కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, జనగావ్, ఉట్నూరు, ఆసిఫాబాద్, నిజామాబాద్, మహబూబ్ నగర్, సూర్యాపేట, దేవరకొండ, మెదక్, రంగారెడ్డి, సిరిసిల్లాలో మహిళలకు కాలేజీలు ఏర్పాటు చేస్తారు.
మణుగూరు, మరిపెడ, ఆదిలాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, కరీంనగర్ లో పురుషులకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయబోతున్నారు.