తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయబడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టీ కల్చర్ యూనివర్సిటీ, పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీలకు శాశ్విత ప్రాతిపదికన వైస్-ఛాన్సిలర్లను నియమించబడ్డారు. పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీకి డాక్టర్ వంగూరి రవీందర్ రెడ్డిని, ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టీ కల్చర్ యూనివర్సిటీకి డాక్టర్ బి. నీరజను వైస్-ఛాన్సిలర్లుగా నియమిస్తూ సిఎం కేసీఆర్ ఫైల్పై సంతకం చేశారు.
ఈ రెండు యూనివర్సిటీలు 2014లో ఏర్పాటు చేయబడ్డాయి. కానీ అప్పటి నుంచి ఈ ఆరేళ్ళలో వ్యవసాయశాఖకు చెందిన ఐఏఎస్ అధికారులతోనే నడిపించేసింది ప్రభుత్వం. ఇప్పుడు రెంటికీ వైస్-ఛాన్సిలర్లు నియమించబడటంతో పూర్తిస్థాయి పాలకమండలిని కూడా ఏర్పాటుచేసుకొనే అవకాశం ఏర్పడింది.