సింగరేణి సంస్థలు ఖాళీలను పట్టి చేయనున్నట్లు సంస్థ సీఎండీ శ్రీధర్ తెలిపారు. శుక్రవారం పత్రికా ప్రకటన ద్వారా ఈ వివరాలను తెలియజేశారు. సింగరేణి సంస్థలో 651 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించవలసి ఉంటుంది.
ఖాళీల వివరాలు:
1. జూనియర్ అసిస్టెంట్ (క్లర్కులు)-177
2. ఫిట్టర్లు -128
3. ఎలక్ట్రిషన్ ట్రైనీలు-51
4. వెల్డర్ ట్రైనీలు -54
5. టర్నర్/మిషనిస్ట్ ట్రైనీలు-22
6. మోటార్ మెకానిక్ ట్రైనీలు-14
7. మౌలర్డ్ ట్రైనీలు-19
8. జూనియర్ స్టాఫ్ నర్సులు-84
9. ల్యాబ్ టెక్నీషియన్లు-7
10. ఫార్మసిస్ట్-5
11. ఫిజియో థెరపిస్ట్: 1
12. ఎక్స్-రే అండ్ ఈసీజీ టెక్నీషియన్స్:2
13. మేనేజిమెంట్ ట్రైనీలు (మైనింగ్):39
14. మేనేజిమెంట్ ట్రైనీలు (ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్):10
15. మేనేజిమెంట్ ట్రైనీలు (సివిల్):7
16. మేనేజిమెంట్ ట్రైనీలు (ఐటి): 6
17. జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్లు: 3
విద్యార్హతలు:
పోస్టులను బట్టి పదో తరగతి, ఇంటర్మీడియెట్ లేదా ఐటిఐ, డిప్లొమా, బీఎస్సీ నర్సింగ్, ల్యాబ్ టెక్నిషియన్, ఇంజనీరింగ్ డిగ్రీ చేసి ఉండాలి.
వయో పరిమితి: దరఖాస్తు గడువు ముగిసే నాటికి 18 నుండి 42 సం.లలోపు వయసు కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, వికలాంగులకు వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.
దరఖాస్తు ఫీజు: జనరల్ మరియు ఓబీసీ అభ్యర్ధులకు : రూ.100; ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు: ఫీజు లేదు.
త్వరలోనే ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని, వీటికి సంబందించి పూర్తి వివరాలకు http//:scclmines.com/ చూడవచ్చని తెలిపారు. ఈ పోస్టులన్నీ మార్చిలోగా భర్తీ చేస్తామని శ్రీధర్ చెప్పారు.