త్వరలో టెట్ నోటిఫికేషన్‌

January 09, 2021
img

ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న బి.ఎడ్, డి.ఎడ్ అభ్యర్థుల ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) నిర్వహణకు విద్యా శాఖ అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. మరో పది రోజుల్లో టెట్ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని తెలిపారు. నోటిఫికేషన్ విడుదల తర్వాత ప్రిపరేషన్ కోసం 8 వారాలు సమయం ఇవ్వనున్నామని అధికారులు చెప్పారు. ఈసారి టెట్ పరీక్ష ఆన్‌లైన్‌లో నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులతో పాటు అన్ని శాఖలలో కలిపి మొత్తం 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు భర్తీ చేయడానికి సిఎం కేసీఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. కనుక ఆ పోస్టుల భర్తీకి అధికారులు చురుకుగా సన్నాహాలు చేస్తున్నారు. కనుక త్వరలోనే వరుసగా నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉంది. 


Related Post