భారత్ ఆర్మీ అధ్వర్యంలో నిర్వహించబడుతున్న పబ్లిక్ స్కూల్స్లో భారీ సంఖ్యలో టీచర్ పోస్టుల భర్తీకి ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 20వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. సుమారు 8,000 టీచర్ పోస్టులను భర్తీ చేయబోతున్నట్లు సమాచారం. వీటికి సంబందించి పూర్తి వివరాలకు, దరఖాస్తు చేసుకోవడానికి http://aps-csb.in వెబ్సైట్లో చూడవచ్చు. ఆర్మీ పాఠశాలలో టీచర్ పోస్టులకు మంచివేతనం, ఇతర సదుపాయాలు లభిస్తాయి. కనుక అర్హత కలిగిన అభ్యర్ధులు, లాక్డౌన్ కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు తక్షణం వీటికి దరఖాస్తు చేసుకొని అదృష్టం పరీక్షించుకోవచ్చు.
9453819324, 9455874492, 9455874491, 9453827207