దోస్త్ గడువు శనివారం వరకు పొడిగింపు

October 10, 2020
img

తెలంగాణలోని డిగ్రీ కళాశాలలో ప్రవేశాల కోసం దోస్త్ (డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసస్ ఆఫ్ తెలంగాణ) 3వ విడత రిజిస్ట్రేషన్స్, వెబ్‌ ఆప్షన్స్ గడువును శనివారం వరకు పెంచుతున్నట్లు దోస్త్ కన్వీనర్ లింబాద్రి ఓ ప్రకటన ద్వారా విద్యార్దులకు తెలియజేశారు. రెండవ విడతలో సీట్లు పొందిన విద్యార్దులు కూడా ఇవాళ్ళ సాయంత్రంలోగా ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవచ్చునని తెలిపారు. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన విద్యార్దులు ఈనెల 30వ తేదీ నుంచి నవంబర్‌ 4వ తేదీలోగా వారు ఎంచుకొన్న లేదా కేటాయించబడిన కళాశాలలలో చేరాలని లేకుంటే సీటు వదులుకొన్నట్లు భావించబడుతుందని తెలిపారు. అక్టోబర్ 15వ తేదీ నుంచి మూడవ విడత సీట్ల కేటాయింపు ఆదేరోజున ప్రత్యేక రిజిస్ట్రేషన్లు, వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియను చేపడతామని తెలిపారు. 



Related Post