జేఈఈ అడ్వాన్స్డ్-2020 పరీక్షా ఫలితాలు ఇవాళ్ళ విడుదలయ్యాయి. ఈ ప్రవేశ పరీక్షలకు హాజరైన విద్యార్దులు తమ ఫలితాలను www.jeeadv.ac.in ఇకారిక వెబ్సైట్లో చూసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఐఐటిలలో బీటెక్ కోర్సులలో ప్రవేశాల కోసం నిర్వహించిన ఈ పరీక్షలకు సుమారు లక్షన్నర మంది విద్యార్దులు హాజరయ్యారు. పేపర్-1కు 1,51,311 మంది, పేపర్-2కి 1,50,900 మంది హాజరయ్యారు. ఐఐటి బాంబే నుంచి పరీక్ష వ్రాసిన చిరాగ్ ఫలోర్ 352/396 మార్కులు సాధించి ఆల్ ఇండియా నెంబర్: 1 ర్యాంక్ సాధించగా, బాలికలలో కనిష్క మిట్టల్ 315/396 సాధించి ప్రధమస్థానంలో, ఆల్ ఇండియా నెంబర్: 17వ ర్యాంకర్గా నిలిచింది.
ఫలితాలు వెలువడినందున రేపు అంటే మంగళవారం నుంచి ఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశాలకు కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది.