డిగ్రీ, పీజీ విద్యార్దులకు ఓ శుభవార్త

September 12, 2020
img

డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ చివరి సంవత్సరం పరీక్షలు వ్రాయబోతున్న విద్యార్దులకు ఓ చిన్న శుభవార్త. ఈనెల 15 నుంచి ప్రారంభం కానున్న పరీక్షలను విద్యార్దులు వారు చదువుకొన్న కాలేజీలలోనే వ్రాసుకోవచ్చు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్దులకు కరోనాబారిన పడకుండా ఉండేందుకుగాను తెలంగాణ విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకొంది. ఈ ఒక్క సంవత్సరమే ఈ వెసులుబాటు ఉంటుందని విద్యాశాఖ తెలియజేసింది.  


Related Post