12 మంది ఉస్మానియా వైద్య విద్యార్దులకు కరోనా

June 02, 2020
img

ఉస్మానియా వైద్య కళాశాలలో 12 మంది విద్యార్దులకు కరోనా సోకింది.  హాస్టల్‌లో మొత్తం 296 మంది విద్యార్దులు  ఉన్నారు. నాలుగైదు రోజుల క్రితం వారిలో ఓ విద్యార్ధిలో కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయగా పాజిటివ్ అని తేలింది. దాంతో అధికారులు హాస్టల్లో ఉన్న మిగిలిన వైద్య విద్యార్దులందరికీ కరోనా పరీక్షలు చేయించగా వారిలో 12 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. వారందరినీ గాంధీ ఆసుపత్రికి తరలించి మిగిలినవారిని రిపోర్టులు వచ్చేవరకు హాస్టల్‌ గదులలో నుంచి బయటకు రావద్దని అధికారులు ఆదేశించారు. ఒకటి రెండు రోజులలో వారి రిపోర్టులు కూడా వస్తే ఇంకా ఎంతమందికి కరోనా సోకిందో తెలుస్తుంది. 


Related Post