కరోనా... లాక్డౌన్ కారణంగా వాయిదాపడిన సిబిఎస్సీ 12వ తరగతి పరీక్షల షెడ్యూల్ ఈరోజు జారీ అయ్యింది. జూలై 1 నుంచి 15వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగనున్నాయి. విద్యార్దులకు కరోనా లక్షణాలు కనబడినట్లయితే పరీక్షలకు హాజరయ్యేందుకు అనుమతించబడరు. కనుక విద్యార్దులందరూ ఈసారి పరీక్షలకు సిద్దం అవుతూనే తమ ఆరోగ్యాలు కూడా కాపాడుకోవలసిన అవసరం ఉంది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్దులు విధిగా మాస్కూలు ధరించి రావాలి. లేకుంటే పరీక్షా కేంద్రాలలోకి అనుమతించబడరు. పరీక్షా కేంద్రాలకు వచ్చే విద్యార్దులకు కరోనా సోకకుండా సిబిఎస్సీ అన్ని జాగ్రత్తలు తీసుకొంటుంది. దేశవ్యాప్తంగా మొత్తం 3,000 కేంద్రాలలో ఈ పరీక్షాపత్రాలు మూల్యాంకనం చేయబడతాయి. దీని కోసం సిబిఎస్సీ భారీగా ఏర్పాట్లు చేసింది.
సిబిఎస్సీ 12వ తరగతి పరీక్షల షెడ్యూల్: