తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని వివిద కులమాతాల ప్రజల సంక్షేమం కోసం పలుపధకాలు అమలుచేస్తున్న సంగతి తెలిసిందే. నిరుపేద బ్రాహ్మణ విద్యార్దులకు విదేశాలలో ఉన్నత విద్యలభ్యసించేందుకు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఇస్తున్న ఫీజు రీయింబర్స్మెంట్ కోసం అర్హులైన బ్రాహ్మణ యువతీయువకులు ఈనెల 31లోగా దరఖాస్తులు చేసుకోవలసిందిగా తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కోరింది. ఈ పధకానికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకొనేందుకు ఫిబ్రవరి 29 నుంచి మార్చి 20వరకు అవకాశం కల్పించారు. దీనిద్వారా మరింత ఎక్కువమందికి అవకాశం కల్పించేందుకు గడువును మార్చి 31వరకు పొడిగించారు.