హైదరాబాద్లోని మల్లేపల్లి ఐటిఐ ప్రాంగణంలో గల ఉపాధి కార్యాలయం (ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజ్)లో ఈ నెల 20వ తేదీ ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు జాబ్ మేళా జరుగనుంది. ఈ మేళాకు సెంటినీ బయో ప్లాంట్ లిమిటెడ్, చోళ ఎంఎస్ జనరల్ ఇన్సూరెన్స్, అపోలో ఫార్మసీ, ఆక్ట్ ఫైబర్నెట్, యాక్సిస్ బ్యాంకు, పేరంగ్రూప్,శుభగృహ ప్రాజెక్ట్సు, కార్వీ ఫోర్డ్ సర్చ్ ప్రైవేట్ లిమిటెడ్, హాయ్ కేర్ సర్వీసెస్,ఒప్పో మొబైల్స్, కాలీబ్ హెచ్ర్ తదితర సంస్థలు పాల్గొని మొత్తం 900 ఉద్యోగాలను భర్తీ చేసుకోబోతున్నాయని ఓయు ఎంప్లాయిమెంట్ అండ్ గైడెన్స్ బ్యూరో అధికారి ఎన్.అనంతరెడ్డి తెలిపారు. కనుక ఆసక్తి గల నిరుద్యోగ యువతీయువకులు శుక్రవారం ఉదయం తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, వాటి జీరాక్సు కాపీలు, గుర్తింపు కార్డులు, పాస్ పోర్ట్ ఫోటోలతో మల్లేపల్లి ఐటిఐ ప్రాంగణంలో గల ఉపాధి కార్యాలయంకు చేరుకోవాలని సూచించారు. ఈ మేళాకు సంబందించి మరిన్ని వివరాలకు 82476 56356, లేదా 88868 84049 ఫోన్ నంబర్లకు కాల్ చేసి తెలుసుకోవచ్చునని చెప్పారు.
జాబ్ మేళాలో పాల్గొనబోతున్న టెలికాం, రియల్ ఎస్టేట్ కంపెనీలను చూసినట్లయితే అవి ప్రధానంగా మార్కెటింగ్, అకౌంటెంట్ ఉద్యోగాలకు అభ్యర్ధులను ఎంపిక చేసుకోవడానికి వస్తున్నట్లు అర్ధం అవుతోంది. కనుక మార్కెటింగ్లో ఆసక్తిగలవారు మాత్రమే వెళ్ళడం మంచిది.