సిద్ధిపేట మెడికల్ కాలేజీ సీట్ల పెంపు

December 16, 2019
img

తెలంగాణ రాష్ట్రంలో మరో 25 మెడికల్ సీట్లు పెరిగాయి. సిద్దిపేట ప్రభుత్వాసుపత్రి అనుబంద వైద్యకళాశాలలో ప్రస్తుతం 150 సీట్లు ఉండగా వాటిని 175కు పెంచుతూ భారత వైద్య మండలి (ఎంసీఏ) ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే విద్యాసంవత్సం నుంచి ఈ పెంపు వర్తిస్తుందని తెలిపింది. సిద్దిపేట వైద్యకళాశాల ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటివరకు రెండు ఎంబీబీఎస్ బ్యాచ్‌లు నడుస్తున్నాయి. 3వ బ్యాచ్ ప్రారంభం అయ్యే సమయానికి మరో 25 సీట్లు అధనంగా ఉంటాయి కనుక రాష్ట్రంలో వైద్యవిద్యను అభ్యసించాలనుకొనే విద్యార్దులకు ఆ మేరకు అవకాశాలు పెరిగినట్లే చెప్పవచ్చు. 


Related Post