రాష్ట్ర విభజన హామీలలో భాగంగా తెలంగాణలో కేంద్రప్రభుత్వం ఒక ట్రైబల్, ఒక ఉద్యానవన యూనివర్సిటీలను ఏర్పాటు చేయవలసి ఉంది. ఇవికాక హైదరాబాద్లో ఒక ఐఐఎం (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్)ను కూడా ఏర్పాటు చేయాలని సిఎం కేసీఆర్ ప్రధాని నరేంద్రమోడీకి విజ్ఞప్తి చేయగా ఆయన సానుకూలంగా స్పందించి వెంటనే కేంద్ర మానవ వనరుల శాఖను హైదరాబాద్లో ఐఐఎం ఏర్పాటుకు తగిన చర్యలు చేపట్టవలసిందిగా ఆదేశించినట్లు తెలుస్తోంది. అది ఇప్పటికే అందుకు కొన్ని చర్యలు చేపట్టింది కనుక అధికారిక తతంగమంతా పూర్తిచేసి త్వరలోనే ప్రకటన చేయవచ్చు.